రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఆడిటర్‌ మృతి

ABN , First Publish Date - 2021-07-25T05:19:02+05:30 IST

ఉంగుటూరు మండ లం కైకరం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో యూనియన్‌ బ్యాంకు ఆడిటర్‌ నేలకంటి సత్యసాయి (53) మృతి చెం దాడు.

రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఆడిటర్‌ మృతి
ప్రమాద దృశ్యం

ఉంగుటూరు, జూలై 24: ఉంగుటూరు మండ లం కైకరం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో యూనియన్‌ బ్యాంకు ఆడిటర్‌ నేలకంటి సత్యసాయి (53) మృతి చెం దాడు. చేబ్రోలు పోలీసుల కఽథనం ప్రకారం హైదరాబాదు లోని కోటి బ్రాంచి యూనియన్‌ బ్యాంకులో ఆడిటర్‌గా పని చేస్తున్న నేల కంటి సత్యసాయి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామ మైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా కైకరం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆడిటర్‌ సత్యసాయి అక్కడికక్కడే మృతి చెందారు. సత్యసాయి కుమారులు ఫల్గుణ, పవన్‌ తనయ్‌లు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Updated Date - 2021-07-25T05:19:02+05:30 IST