తమిళనాడులో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-06-21T21:04:35+05:30 IST

తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్యాకుమారి, కరుంగల్ సమీపంలో అతి వేగంతో వచ్చిన కారు కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా  మరొకరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-21T21:04:35+05:30 IST