న్యూగుంటూరు రైల్వే కాలనీ ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-30T05:23:25+05:30 IST
న్యూగుంటూరు రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం రైల్వే శాఖ వారు పనిచేసే ప్రదేశానికి సమీపంలోనే క్వార్టర్స్ నిర్మించింది.
గుంటూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): న్యూగుంటూరు రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం రైల్వే శాఖ వారు పనిచేసే ప్రదేశానికి సమీపంలోనే క్వార్టర్స్ నిర్మించింది. మొత్తం 20 డబుల్ బెడ్రూం ఫ్లాట్లతో నిర్మించిన న్యూగుంటూరు రైల్వే కాలనీ టవర్-1ని బుధవారం డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్.మోహన్రాజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటారు. డీఆర్ఎం మాట్లాడుతూ సువిశాలమైన ప్రదేశంలో కాలూష్య రహిత వాతావరణం మధ్యన క్వార్టర్స్ నిర్మాణం చేయడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎంలో కేవీ రామామెహర్, ఆర్.శ్రీనివాస్, సీనియర్ డీఈఈ(సమన్వయం) జేవీ అనూష, సీనియర్ డీఈఈ బి.శ్రీనివాసు, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్య బీ రాజ్, సీనియర్ డీవోఎం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.