ఈనెలాఖరుకు నాడు-నేడు పనుల పూర్తి
ABN , First Publish Date - 2020-08-08T09:02:59+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయించి.. పాఠశాలలను సర్వాంగ ..
నరసన్నపేట, ఆగస్టు 7: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయించి.. పాఠశాలలను సర్వాంగ తీర్చిదిద్దుతామని ప్రాథమిక విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు అన్నారు. ఈమేరకు శు క్రవారం జమ్ము, నరసన్నపేటలో నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో పగడాలమ్మ, ఎంఈవో ఉప్పాడ శాంతారావు, జమ్ము పాఠశాల హెచ్ఎం కళ్యాణి, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం పైడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నా ణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆర్జేడీ నాగేశ్వరరావు ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం టెక్కలిపాడు, రావిపాడు పాఠశాలల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు తల్లిదండ్రుల కమిటీకి పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు డెప్యూటి డీఈవో పగడాలమ్మ, జలుమూరు, నరసన్నపేట ఎంఈవోలు బి.మాధవరావు, ఉప్పాడ శాంతారావు, రావిపాడు హెచ్ఎం వైకుంఠరావు ఉన్నారు.