బిహార్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడాలి: ఆర్జేడీ డిమాండ్

ABN , First Publish Date - 2020-08-08T00:07:52+05:30 IST

వాస్తవానికి బిహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29తో పూర్తవుతుంది. దీని ప్రకారం.. ఈ యేడాది అక్టోబర్-నవంబర్‌లలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న

బిహార్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడాలి: ఆర్జేడీ డిమాండ్

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) డిమాండ్ చేసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రజలు పోలింగ్‌లో పాల్గొనడం చాలా సమస్యాత్మకమని అందుకే ఎన్నికలను వాయిదా వేయాలని భారతీయ జనతా పార్టీ సహా పలు పార్టీలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను కోరాయి. అయితే ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని పలు పార్టీలు ఈసీని కోరాయి.


వాస్తవానికి బిహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29తో పూర్తవుతుంది. దీని ప్రకారం.. ఈ యేడాది అక్టోబర్-నవంబర్‌లలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న బిహార్‌లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా ప్రభావం భయానకంగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2020-08-08T00:07:52+05:30 IST