మూడు రాష్ట్రాల ఎన్నికల గోదాలోకి దిగనున్న ఆర్జేడీ

ABN , First Publish Date - 2021-02-27T23:58:35+05:30 IST

అసోం, బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగాలని ఆర్జేడీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శనివారం అసోంకు

మూడు రాష్ట్రాల ఎన్నికల గోదాలోకి దిగనున్న ఆర్జేడీ

పాట్నా : అసోం, బెంగాల్, కేరళ  అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగాలని ఆర్జేడీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శనివారం అసోంకు చేరుకున్నారు. స్థానికంగా ఉండే పార్టీలతో పొత్తు కుదుర్చుకోడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయమై చర్చించడానికే తాము గౌహతికి చేరుకున్నామని వెల్లడించారు. హిందీ మాట్లాడే ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతామని ఆయన ప్రకటించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని. అసోం, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో మిత్రులతో కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని ఆర్జేడీ నేత మృత్యుంజయ తివారీ తెలిపారు. మరోవైపు అసోం, బెంగాల్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆర్జేడీ అధిష్ఠానం ఇప్పటికే పరిశీలకులను పంపింది. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి తేజస్వీకి పరిశీలకులు ఓ నివేదికను సమర్పిస్తారని పార్టీ నేతలు తెలిపారు. 


Updated Date - 2021-02-27T23:58:35+05:30 IST