బోచహాన్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆర్జేడీ గెలుపు
ABN , First Publish Date - 2022-04-16T20:33:27+05:30 IST
బీహార్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. బోచహాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన..
పాట్నా: బీహార్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. బోచహాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో విపక్ష ఆర్జేడీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 35,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందరు. ముసాఫిర్ పాశ్వాన్ మృతితో ఇక్కడ ఉపఎన్నిక జరుగగా, ఆయన కుమారుడు అమర్ పాశ్వాన్ ఆర్జేడీ నుంచి పోటీ చేశారు. ఆయనకు 82,116 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి బేబీ కుమారి కేవలం 45,353 ఓట్లు గెలుచుకున్నారు. వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) నేత ముకేష్ సహాని 29,671 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. నెల రోజుల క్రితం వరకూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా వీఐపీ ఉంది.