కరోనా అదుపులో కేంద్ర వైఫల్యంపై రిట్!
ABN , First Publish Date - 2020-08-13T07:10:29+05:30 IST
కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ ‘తప్పిదాల’పై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో కమిషన్ నియమించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నది...
న్యూఢిల్లీ, ఆగస్టు 12: కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ ‘తప్పిదాల’పై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో కమిషన్ నియమించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నది. ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులు సహా ఆరుగురు కలిసి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.