దేవినేని ఉమకు ప్రాణహాని: అనుపమ
ABN , First Publish Date - 2021-08-01T00:03:11+05:30 IST
రాజమండ్రి జైలులో ఉన్న తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని ఉమ
విజయవాడ: రాజమండ్రి జైలులో ఉన్న తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని ఉమ భార్య అనుపమ ఆందోళన వ్యక్తం చేసింది. ఉమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్ర హోంమంత్రి సుచరితకు అనుపమ లేఖ రాసింది. ప్రజా జీవితంలో ఉమ చాలా క్రియాశీలకంగా ఉన్నారని పేర్కొంది. అవినీతిపరులకు, ప్రత్యేకించి అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేవినేని ఉమను మైనింగ్ మాఫియా, గూండాలు లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు.