కొండెక్కుతున్న కూరగాయల ధరలు
ABN , First Publish Date - 2020-06-03T10:57:54+05:30 IST
కరోనా ని యంత్రణ కోసం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో తక్కువ ధర లకు లభించిన ..
కిలో పచ్చిమిర్చి రూ.60
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 2: కరోనా ని యంత్రణ కోసం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో తక్కువ ధర లకు లభించిన కూరగాయలు ప్రస్తుతం చు క్కలు చూపిస్తున్నాయి. లాక్డౌన్లో కిలో రూ.10 నుంచి రూ.20 లోపు లభించగా ప్ర స్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పె రిగిపోయాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ఘాటె క్కిస్తోంది. ఇటీవల కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్సెల్లో రూ.50 కా గా రిటైల్గా రూ.60కి చేరింది. బీన్స్, కాకర, చామదుంప, బంగాళదుంప, వంటి కూరగా యలు రూ.30 దాటిపోగా, పెద్దచిక్కుళ్ళు కిలో రూ.60కి చేరింది.
లాక్డౌన్ సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉదయం సమయంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో తోపుడు బండ్ల ద్వారా కూరగాయలను విక్ర యించారు. అయితే ఇప్పుడు లాక్డౌన్ సడ లింపులు ఇవ్వడంతో తాత్కాలికంగా కూరగా యల వ్యాపారం చేసిన వారంతా తమ వృ త్తుల్లోకి వారు వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు గతంలో చేసిన వ్యాపారులు మాత్రమే కూర గాయలు విక్రయిస్తుండటంతో వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నారు. రోజురోజుకు వాటి ధరలు పెరిగిపోతున్నాయి.