AP News: తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద
ABN , First Publish Date - 2022-07-27T15:08:28+05:30 IST
జిల్లాలోని తుంగభద్ర జలాశయాని (Tungabhadra Reservoir)కి వరద ప్రవాహం పెరుగుతోంది.
కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర జలాశయాని (Tungabhadra Reservoir)కి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు జలాశయం 12 గేట్లను ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 1632.81 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 38087 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 34993 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 105.025 టీఎంసీలుగా కొనసాగుతోంది.