Dhavaleswaram barrage వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-14T15:15:37+05:30 IST

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది.

Dhavaleswaram barrage వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం

అమరావతి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్(dhavaleswaram cotton barrage) వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.52 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. వదర ప్రవాహం నేపథ్యంలో సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్  వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్(NDRF), 5 ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలు పాల్గొన్నాయి. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3,  ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని... జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు. 

Updated Date - 2022-07-14T15:15:37+05:30 IST