సిక్సర్తో సెంచరీ చేసిన పంత్.. చివరి టెస్టుపై పట్టుబిగుస్తున్న భారత్
ABN , First Publish Date - 2021-03-05T21:56:49+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో పంత్ అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు వడివడిగా వికెట్లు
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో పంత్ అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు వడివడిగా వికెట్లు కోల్పోతున్న వేళ క్రీజులో పాతుకుపోయి నెమ్మదిగా పరుగులు పేర్చుకుంటూ పోయాడు. ఈ క్రమంలో 115 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 94 పరుగుల వద్ద రూట్ వేసిన 84వ ఓవర్ తొలి బంతిని స్టాండ్స్లోకి పంపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. టెస్టుల్లో పంత్కు ఇది మూడో సెంచరీ.
ఇంగ్లిష్ బౌలర్ల దెబ్బకు ఆటగాళ్లందరూ క్యూకడుతున్న వేళ క్రీజులోకి వచ్చిన పంత్ జట్టులో తానెంత విలువైన ఆటగాడినో మరోమారు తెలియజెప్పాడు. అద్బుత ఆటతీరుతో టెస్టుపై పట్టు సాధించేలా చేశాడు. అయితే, సెంచరీ పూర్తయిన వెంటనే జేమ్స్ అండర్స్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (40), అక్షర్ పటేల్ (0) క్రీజులో ఉన్నారు. ఏడు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన భారత్ ఇంగ్లండ్పై 55 పరుగుల ఆధిక్యంలో ఉంది.