Covid Vaccineపై డాక్టర్ వివేక్ మూర్తి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-19T21:47:35+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సర్జన్ జనరల్, భారత సంతతికి చెందిన వ్యక్తి డాక్టర్ వివేక్ మూర్తి కీల

Covid Vaccineపై డాక్టర్ వివేక్ మూర్తి కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సర్జన్ జనరల్, భారత సంతతికి చెందిన వ్యక్తి డాక్టర్ వివేక్ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన.. గత కొద్ది రోజులుగా అమెరికాలో కొవిడ్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుతుండటంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా బారినపడుతన్న వారిలో టీకా తీసుకోనివారే అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రజలకు సూచించారు. మహమ్మారిని ఎదుర్కొవడంలో కొవిడ్ వ్యాక్సిన్‌లు దీటుగా పని చేస్తున్నాయని వివేక్ మూర్తి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ రక్షణ కవచంలా పని చేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం మహమ్మారి కారణంగా చనిపోతున్న వారిలో 99.5 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. 


Updated Date - 2021-07-19T21:47:35+05:30 IST