ఘనంగా పండిత సదస్యం
ABN , First Publish Date - 2021-06-24T05:06:52+05:30 IST
శ్రీముఖలింగేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. పలువురు వేద పండితులు స్వామిని కీర్తిస్తూ తమ రచనలు, వేద మంత్రాలను ఆలపించారు.
శ్రీముఖలింగం (జలుమూరు) జూన్ 23: శ్రీముఖలింగేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. పలువురు వేద పండితులు స్వామిని కీర్తిస్తూ తమ రచనలు, వేద మంత్రాలను ఆలపించారు. కార్యక్రమంలో ఈవో ఎన్వీ రమణయ్య, అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, సింహాచలం, పురోహితులు భూషణ శర్మ పాల్గొన్నారు. ఫ మాకివలస జగన్నాథస్వామి ఉత్సవాలు పురస్కరించుకొని వంశధార నదిలో బుధవారం గ్రామస్థులు పానీ హాట్ ఉత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకుడు నికేతన్ దాసు ఆధ్వర్యంలో బలరామకృష్ణులు ఉత్సవ మూర్తులను వంశధార నదికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు, స్నానాలను చేపట్టారు.