ఘనంగా చక్రస్నానం
ABN , First Publish Date - 2022-05-17T06:09:07+05:30 IST
పట్టణంలోని చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం చెన్నకేశవస్వామిని ఉదయం 6గంటల కు పుష్పమండపంపై ఊరేగించారు.
ధర్మవరం, మే 16: పట్టణంలోని చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం చెన్నకేశవస్వామిని ఉదయం 6గంటల కు పుష్పమండపంపై ఊరేగించారు. తిరిగి 10గంటలకు వసంతోత్సవం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహా లను హంసవాహనంపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. మంగళవారం ఉదయం 6గంటలకు దేవతా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు పొరాళ్ల పద్మావతి, చౌడయ్య, అన్నమయ్య సేవామండలి అధ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య పాల్గొన్నారు.