ఘనంగా భోగి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-15T04:05:38+05:30 IST

మంచిర్యాల పట్టణంలో భోగి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయమే వాకిళ్ల ముందు ముగ్గులు వేసి భోగి పళ్లు పోశారు.

ఘనంగా భోగి సంబరాలు
మంచిర్యాలలో భోగి మంటలు వేస్తున్న వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు

ఏసీసీ, జనవరి 14: మంచిర్యాల పట్టణంలో భోగి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయమే వాకిళ్ల ముందు ముగ్గులు వేసి భోగి పళ్లు పోశారు. వాకర్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో భోగి వేడుకలను నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పాటలతో పిల్లలు, పెద్దలు వేప, రావి, మామిడి కట్టెలు, నెయ్యితో భోగిమంటలు వేశారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు సందెల వెంకటేష్‌, వీరస్వామి, సాగర్‌యాదవ్‌, చంద్రమౌళి, సంతోష్‌, సుధీర్‌, బద్రుద్దీన్‌, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఓం అష్టోత్తర యోగా పీఠ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని రెడ్డి కాలనీలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేణుగోపాల్‌, శ్రీనివాస్‌, ధర్మేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో  భోగి వేడుకలను నిర్వహించారు.  ఆలయాల్లో భక్త్తులు ప్రత్యేక పూజలు చేశారు.  
జన్నారం: మండలంలోని ప్రజలు భోగి పండగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణాల్లోని ప్రజలు ఇళ్లకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
హాజీపూర్‌: మండలంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.  మండలంలో సందడి వాతావరణం నెలకొంది.
భీమారం: మండలంలోని ఆయా గ్రామాల్లో ఉదయం భోగి మంటలను వేశారు. మహిళలు ఉదయం ఇంటి వాకిళ్ల ముందు రంగవల్లులు వేసి భోగి పళ్లు పెట్టారు.
మందమర్రిరూరల్‌:  మండల వ్యాప్తంగా భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు ఉదయమే ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి అలరించారు.
మందమర్రిటౌన్‌: పట్టణంలో భోగి పండగ వేడుకలను ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారులు, యువకులు గాలి పటాలను కొనుగోలు చేశారు.
తాండూర్‌: మండల కేంద్రంలో స్థానిక జడ్పీటీసీ బానయ్య ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ పాఠశాలలో నిర్వహించిన సంబరాల్లో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీల విజేతలకు శనివారం బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కళ్యాణి,జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, ఎంపీపీ ప్రణయ్‌, సర్పంచ్‌ నవీన్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T04:05:38+05:30 IST