ఘనంగా బౌద్ధమేళా

ABN , First Publish Date - 2021-01-16T05:09:07+05:30 IST

ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద శుక్రవారం బౌద్ధమేళాను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బౌద్ధమేళా
ప్రధాన స్థూపం వద్ద పూజలు చేస్తున్న బౌద్ధ భిక్షవులు

బొజ్జన్నకొండకు తరలి వచ్చిన భక్తులు


తుమ్మపాల, జనవరి 15: ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద శుక్రవారం బౌద్ధమేళాను ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షవులు, బౌద్ధ ప్రియులు కలిసి బౌద్ధ పతాకావిష్కరణ చేశారు. కొండపైన ప్రధాన స్థూపం వరకు శాంతియాత్ర చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ దిగువన ఏర్పాటు చేసిన మహాసభలో ఉండ్రారాజవరం బౌద్ధ ధర్మపీఠం వ్యవస్థాపకులు, బౌద్ధ బిక్షువు వెనరబుల్‌ భంతే అనాలయో ప్రసంగించారు. బొజ్జంగ ధర్మాలను అవలంభించడం ద్వారా కుటుంబాల్లో శాంతి, సంతోషాలు వస్తాయని చెప్పారు. అష్టాంగ నియమాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో బౌద్ధ సంఘాల ఉపాధ్యక్షుడు బోర వేణుగోపాల్‌గౌతమ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:09:07+05:30 IST