పాయల్ ఘోష్ పై కోర్టుకు రిచా ఛధ్ధా..?

ABN , First Publish Date - 2020-09-21T20:58:29+05:30 IST

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేస్తున్న సందర్బంలో నటి పాయల్ ఘోష్ తన పేరును ప్రస్తావించడంసటకల మరో నటి రిచా ఛధ్ధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన బాధితురాళ్లకు న్యాయం జరగాల్సిందంటూనే... మధ్యలో తన పేరును ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందని ప్రశ్నించింది.

పాయల్ ఘోష్ పై కోర్టుకు రిచా ఛధ్ధా..?

ముంబై : దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేస్తున్న సందర్బంలో  నటి పాయల్ ఘోష్  తన పేరును  ప్రస్తావించడంసటకల మరో నటి రిచా ఛధ్ధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన బాధితురాళ్లకు న్యాయం జరగాల్సిందంటూనే... మధ్యలో తన పేరును ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందని ప్రశ్నించింది.


ఈ మేరకు పాయల్ కు తన లాయర్ ద్వారా నోటీసును కూడా పంపింది. తన  క్లయింటు ప్రతిష్టను దిగజార్చే విధంగా పాయల్ ఘోష్ ప్రవర్తించిందని, ఆమెపై కోర్టుకెక్కుతామని ఆ లాయర్ పేర్కొన్నారు. మరోవైపు...


అనురాగ్ కశ్యప్ పై పాయల్ పలు ఆరోపణలు చేసినప్పటికీ... ఆయనకు తాప్సీ పొన్ను, అనుభవ్ సిన్హా, రాధికా ఆప్టే , కల్కి కొచిన్ వంటి పలువురు సెలబ్రిటీలు మద్దతు పలికారు. ఇక... తాప్సీ అయితే మరో ముందడుగు వేసి... ఆయనతో తాను చేయబోయే నూతన సినీ ప్రాజెక్టు గురించి ప్రస్తావించింది కూడా.

Updated Date - 2020-09-21T20:58:29+05:30 IST