ఘనంగా సందెరాళ్ల పోటీ

ABN , First Publish Date - 2022-05-19T04:36:08+05:30 IST

మండల కేంద్రంలోని లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సందెరాళ్ల పోటీ నిర్వహించారు.

ఘనంగా సందెరాళ్ల పోటీ
90 కేజీల రాయిని ఎత్తిన నర్సిములు

మాగనూరు, మే 18 : మండల కేంద్రంలోని లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సందెరాళ్ల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో కున్సీ గ్రామానికి చెందిన నర్సిములు మొదటి బహుమతి గెలుపొందగా, రెండో బహుమతి ఇబ్రహాందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్‌ గెలుపొందారు. కుక్కునూరు, అంపయ్య, రాంపురం, నాగర్‌దొడ్డి గ్రామాలకు చెందిన యువకులు పోటీలో పాల్గొని బహుమతులు గెలుపొందారు. ఆలయ కమిటీ తరపున మొదటి బహుమతి రూ.5వేలు, రెండో బహుమతి రూ.3వేలు, మూడో బహుమతి రూ.2వేలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు రాజు, ఎంపీపీ శ్యామలమ్మ, చిన్నప్ప, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీనివాసులు, సత్యప్ప, వాబయ్య, అభి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:36:08+05:30 IST