ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2022-01-15T04:07:05+05:30 IST
జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 14: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా గోదారంగనాథస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వికాస తరంగిణి చినజీయర్ స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ హాల్లో శుక్రవారం గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పొన్నమనేని హన్మంతరావు, బల్మూరి నర్సింగరావు, కృష్ణరావు, శ్రీధర్, రాధాకృష్ణ, అల్లాడి శ్రీనివాస్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం లోని విశ్వనాధ ఆలయంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాఽథుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు-రాజమణి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దండేపల్లి: మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయంలో శుక్రవారం గోదా రంగనాథస్వామి(గోదాదేవి)కల్యాణం వేభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీని వాస్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ముఖ్య అర్చకులు గోవర్ధన రఘస్వామి, సంపత్స్వామి, వేదపండితులు దిద్దళ్లు నారాయ ణశర్మ ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణం నిర్వహించారు.
నస్పూర్: నస్పూర్ పట్టణం గోదావరి కాలనీలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం గోదారంగనాయక స్వామి (గోదాదేవి) కల్యాణం అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సముద్రాల లక్ష్మాణా చార్యులు, వెంకటరమణాచార్యులు, నరేష్తో పాటు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: పట్టణంలోని సుభాష్నగర్లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో గోదా రంగనాయకుల స్వామి కల్యాణాన్ని వేద పండి తులు చిమిరాల దామోదరచార్యులు, ఆలయ పూజారీ సేనాపతి రామకృష్ణచార్యులు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆసం ఏడుకొండలు, చైర్మన్ మోక్షానందం, వీరేశం , భక్తులు పాల్గొన్నారు.
భీమారం: మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో గోదా రంగనాథుల కల్యాణాన్ని ఆలయ చైర్మన్ చేకుర్తి సత్యనా రాయణరెడ్డి ఆధ్వర్యంలో అర్చకుడు తిరుణంగిరి ప్రవీణ్కుమార్ ఘనంగా నిర్వ హించారు. ఎంపీటీసీ చేకుర్తి సరోజ, భక్తులు పాల్గొన్నారు.
జైపూర్: మండలంలోని శెట్పల్లి గ్రామంలోని కోదండ రామాల యంలో గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహిం చారు. జడ్పీటీసీ మేడి సునీతతిరుపతి, ఎంపీటీసీ స్వాతిసంపత్, గ్రామ పెద్దలు నర్సింగరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
మందమర్రిటౌన్: పట్టణంలోని వేంకటేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి గోదాదేవి కల్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పల్లకిసేవ నిర్వహించారు.