పౌరసరఫరాల గోదాం నుంచే అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం

ABN , First Publish Date - 2022-07-02T05:05:05+05:30 IST

ఈ నెల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా పౌరసరఫరాల గోదాంల నుంచే బియ్యం సరఫరా చేయనున్నట్లు ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు అధికారి బ్రహ్మాజీ తెలిపారు.

పౌరసరఫరాల గోదాం నుంచే అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం

 అల్లాదుర్గం, జూలై 1: ఈ నెల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా పౌరసరఫరాల గోదాంల నుంచే బియ్యం సరఫరా చేయనున్నట్లు ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు అధికారి బ్రహ్మాజీ తెలిపారు. శుక్రవారం అల్లాదుర్గంలో నిర్వహించిన సెక్టార్‌ సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడారు. ఇక నుంచి డీలర్ల వద్ద కాకుండా కేంద్రాలకు గోదాం నుంచే బియ్యం సరఫరా చేస్తారన్నారు. టీచర్లు ఒక్క రూపాయి ఇవ్వకుండానే బియ్యం బస్తాలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద స్థలం ఉన్నా, లేకుంటే పాత బాకెట్లను వినియోగించుకొని పండ్లు, కూరగాయల మొక్కలు పెంచాలని ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ఈ నెలలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. 

 

 

Updated Date - 2022-07-02T05:05:05+05:30 IST