వారానికి రెండ్రోజులైనా సిరి ఽధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలి

ABN , First Publish Date - 2022-01-17T07:12:35+05:30 IST

వారానికి రెండ్రోజులైనా తిరుమలలో శ్రీవారి భక్తులకు సిరి ధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలని సినీనటుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి కోరారు.

వారానికి రెండ్రోజులైనా సిరి ఽధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలి
నటుడు శ్రీనివాస్‌, టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు, నటుడు భరత్‌రెడ్డి

సినీ నటుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి


తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వారానికి రెండ్రోజులైనా తిరుమలలో శ్రీవారి భక్తులకు సిరి ధాన్యాలతో అన్నప్రసాదాలు పెట్టాలని సినీనటుడు డాక్టర్‌ భరత్‌రెడ్డి కోరారు. టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు, సినీ నటులు పసుకూరి శ్రీనివాస్‌, గుండు రవితేజతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం తినే విధానం మారాలన్నారు. ఇప్పుడు మారకపోతే భాతరదేశంలో తర్వాత తరం ఉండదన్నారు. రాబోవు తరానికి మనం ఇచ్చే బెస్ట్‌ మెడిసిన్‌ సిరిఽధాన్యాలతో ఆహారమన్నారు. ఇండియా తినే విధానాన్ని రాబోవు రెండుమూడేళ్లలో తప్పకుండా మారుస్తామన్నారు. ఇక తమ ‘మిల్లెట్‌ మార్వెల్స్‌’ హోటళ్లను కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. మురంశెట్టి రాములు మాట్లాడుతూ.. సిరిధాన్యాలతో భక్తులకు కనీసం వారంలో ఒక్కసారైనా అన్నప్రసాదాలు అందించేలా ధర్మకర్తల మండలిలో చర్చిస్తామన్నారు. 

Updated Date - 2022-01-17T07:12:35+05:30 IST