200 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-01-21T06:21:44+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసు కుని లారీని సీజ్‌ చేశారు.

200 బస్తాల   రేషన్‌ బియ్యం పట్టివేత
సీజ్‌ చేసిన బియ్యం లారీతో ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు


తర్లుపాడు, జనవరి 20 : అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసు కుని లారీని సీజ్‌ చేశారు. ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు కథనం ప్రకా రం.. బేస్తవారపేట పరిసర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొను గోలు చేసి దర్శి ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో తాడివారిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం తనిఖీలు చేపట్టారు. ఒక లారీలో 200 బస్తాల రేషన్‌ బియ్యం ఉండటాన్ని గుర్తించారు. బియ్యాన్ని తరలిస్తున్న ఉయ్యాల కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసు కున్నారు. బియ్యంతోసహా లారీని సీజ్‌ చేశామని, దాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-21T06:21:44+05:30 IST