AP News: అనంతపురంలో రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-27T20:46:02+05:30 IST

ప్రజలను మోసం చేసే రైస్ పుల్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

AP News: అనంతపురంలో రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్

అనంతపురం: ప్రజలను మోసం చేసే రైస్ పుల్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 3 నకిలీ(మనిగిన్నెలు) గిన్నెలు, రెండు రాగి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నెల్లూరు నుంచి అనంతపురం వచ్చి అమాయక ప్రజలను రైస్ పుల్లింగ్ పేరున మోసానికి పాల్పడుతున్నట్లు పొలీసులు గుర్తించారు. ముఠా సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2022-07-27T20:46:02+05:30 IST