పది రోజుల్లో బియ్యం కార్డు మంజూరు : మంత్రి కొడాలి
ABN , First Publish Date - 2020-08-07T10:10:00+05:30 IST
దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో లబ్ధిదారులకు బియ్యం కార్డు అందజేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు.
గుడివాడ : దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో లబ్ధిదారులకు బియ్యం కార్డు అందజేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. రెండో వార్డు సచివాలయంలో గురువారం బియ్యం కార్డును లబ్ధిదారు లకు అందజేశారు. అర్హులకు దరఖాస్తు చేసిన 10రోజుల్లోనే పింఛన్ మంజూరు అవుతుందన్నారు. 20రోజుల్లో ఆరోగ్యశ్రీకార్డు, 90రోజుల్లో ఇళ్లపట్టాలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఆర్డీవో జి.శ్రీనుకుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందేలా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి నాని అన్నారు. బాపూజీనగర్ మహిళ స్థలంకోసం దరఖాస్తు చేసుకోగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.