రియా తప్పులేకుంటే పారిపోవాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే బబ్లూ
ABN , First Publish Date - 2020-08-08T02:33:06+05:30 IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై అతడి బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ..
పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో రియా చక్రవర్తి ప్రమేయం లేకుంటే ఆమె భయపడాల్సిన అవసరం లేదని సుశాంత్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ పేర్కొన్నారు. ఆమె తప్పులేనప్పుడు దర్యాప్తు నుంచి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘రియా అమాయకురాలైతే విచారణ నుంచి పారిపోవల్సిన అవసరం ఏముంది? ఆమె ధైర్యంగా అన్ని విషయాలు బయటపెట్టాలి. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దోషులు ఎంతటివాళ్లైనా వదలకూడదు..’’ అని బబ్లూ పేర్కొన్నారు. సుశాంత్ మృతి కేసులో రియా చక్రవర్తి ఇవాళ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇదే కేసులో విచారణకు రావాలంటూ సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ, సుశాంత్ మిత్రుడు సిద్ధార్థ్ పితానీలకు కూడా ఈడీ సమన్లు జారీచేసింది.