జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపిక పోటీలు
ABN , First Publish Date - 2021-10-25T05:41:17+05:30 IST
జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపిక పోటీలు ఈపూరు హైస్కూల్లో ఆదివారం నిర్వహించారు.
ఈపూరు, అక్టోబరు 24: జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపిక పోటీలు ఈపూరు హైస్కూల్లో ఆదివారం నిర్వహించారు. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలలో ఫ్రీ స్టైల్ పురుషుల విభాగంలో కే నాగరాజు(57 కేజీలు), డీ వంశీ (61 కేజీలు), టీ మరియబాబు(65 కేజీలు), వై వంశీ(70 కేజీలు), కే రామకృష్ణ(86 కేజీలు), గ్రేట్మెన్ స్టయిల్లో ఎస్ సుధాకర్ (55 కేజీలు), ఎన్ విజయకుమార్(60 కేజీలు), వై రత్నకుమార్(63కేజీలు), ఎం పెదరాయుడు(67 కేజీలు), సీహెచ్ రాజు(77కేజీలు), పీ నాగరాజు(82 కేజీలు), పవన్ (74 కేజీలు), ఎన్ శివనాగేంద్ర ప్రసాదు(79కేజీలు), మహిళల విభాగంలో పీ సాగరిక(57 కేజీలు), ఎస్కే నూర్జహాన్(59 కేజీలు), పీ మేరీ(62 కేజీలు), కే సామేశ్వరమ్మ(65 కేజీలు), ఎస్కే మున్నీబేగం(50 కేజీలు), ఎస్కే జరీనాబేగం (53 కేజీలు), ఎస్కే హసీనాబేగం(55 కేజీలు) ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి పీ వెంకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ మద్ద వెంకటేశ్వర్లు, ఉన్న శ్రీనివాసరావు, కోచ్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.