రేపు శంషాబాద్‌కు రేవంత్‌రెడ్డి రాక

ABN , First Publish Date - 2022-05-23T06:03:20+05:30 IST

రేపు శంషాబాద్‌కు రేవంత్‌రెడ్డి రాక

రేపు శంషాబాద్‌కు రేవంత్‌రెడ్డి రాక


శంషాబాద్‌, మే 22: శంషాబాద్‌కు ఈనెల 24వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మండలఅధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని కాంగ్రె్‌సపార్టీ కార్యాలయంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 3గంటలకు  మండలంలోని ఘాంసిమియ గ్రామంలో రైతు డిక్లరేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ  కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రె్‌సపార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు పీఎన్‌.సంజయ్‌యాదవ్‌, రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జి జ్ఞానేశ్వర్‌యాదవ్‌, సానెం శ్రీనివా్‌సగౌడ్‌, టీపీసీసీ ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షుడు జే.నరేందర్‌, ఆంజనేయులు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:03:20+05:30 IST