సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-03-15T23:33:28+05:30 IST

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో, రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యల నేపత్యంలో రైతు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఇటీవల తాను మహబూబాబాద్ ప్రాంతంలో పర్యటించి వచ్చి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసానని ఆయన పేర్కొన్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేస్కున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక లు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాయని ఆయన పేర్కొన్నారు. 


అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. రైతు వేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు. 

Updated Date - 2022-03-15T23:33:28+05:30 IST