సీఎం కేసీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2020-10-01T22:47:30+05:30 IST
సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్- కొడంగల్ లిఫ్ట్
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్- కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్చాలని లేఖలో కోరారు. ‘రాజకీయ దురుద్దేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన కొడంగల్ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని కేఆర్ఎంబీ నా లేఖకు స్పందనగా ప్రత్యుత్తరం ఇచ్చింది. జలాల కేటాయింపులో ఏడేళ్లుగా మోదీ ఉలకకపోయినా.. బీజేపీ ప్రయోజనాల కోసం మీరు పలుకుతూనే ఉన్నారుగా!. ఏపీ కయ్యానికి కాలు దువ్వుతోందంటోన్న మీకు ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు?’ అని లేఖలో రేవంత్రెడ్డి నిలదీశారు.