సీఎంపై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST
సీఎంపై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
మేడ్చల్ అర్బన్, మే 24 : రచ్చబండలో రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు సరికాదని, అవన్నీ పచ్చి అబద్ధాలని టీఆర్ఎస్ పార్టీ మూడుచింతలపల్లి మండలాధ్యక్షుడు మల్లే్షగౌడ్, ఎంపీపీ హారిక భర్త మురళీగౌడ్లు విమర్శించారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్లో సోమవారం జరిగిన రచ్చబండలో రేవంత్రెడ్డి సీఎంపై చేసిన వ్యాఖ్యలను మంగళవారం లక్ష్మాపూర్లో విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్రెడ్డి ఏమీ తెలియకుండానే సీఎంపై విమర్శలు చేశారన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ రూ.17 కోట్లు నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. రెవెన్యూ సమస్యలపై రేవంత్రెడ్డి ఎక్కువగా మాట్లాడారని, ఈ సమస్య గత 50 సంవత్సరాలుగా ఉందని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. సీఎం చొరవతో ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని, ఇప్పటికే ఎన్నో రెవెన్యూ సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కొద్దిరోజుల్లోనే మిగతా సమస్యలనుపరిష్కరిస్తారని చెప్పారు. ఏం తెలియకుండా విమర్శలు చేయడం తగదని వారుహెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగం ఆంజనేయులు, ఎంపీటీసీ నాగరాజు, తెలంగాణఉద్యమకారుడు స్వామి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోపాల్, టీఆర్ఎస్ గ్రామసెక్రటరీ బండి నవీన్, గ్రామకమిటీ ఉపాధ్యక్షుడు నర్సింగ్రావు, గ్రామ పంచాయతీ సభ్యులు సత్యనారాయణ, తోట పరమేష్ తదితరులు పాల్గొన్నారు.