విద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

ABN , First Publish Date - 2022-07-06T07:00:20+05:30 IST

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి కృషిచేస్తున్నారని ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

విద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు విద్యాకానుక అందజేస్తున్న ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు


ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

చీడికాడ, జూలై 5: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి కృషిచేస్తున్నారని ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంచాల మోడల్‌ స్కూల్‌లో మంగళవారం విద్యార్థులకు విద్యాకానుక కిట్లను అందజేశారు. అనంతరం పదవ తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షీల్డ్‌లు అందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు నాడు-నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రబాబు, ప్రిన్సిపాల్‌ చెరకాపు వెంకటలక్ష్మి, వ్యవసాయ సలహాకమిటీ చైర్‌పర్సన్‌ యర్రా అప్పారావు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ శీరంరెడ్డి సూర్యనారాయణ, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ కురచా రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T07:00:20+05:30 IST