ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు

ABN , First Publish Date - 2022-06-26T06:42:07+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయని, కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
మన ఊరు, మనబడి కార్యక్రమంలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేస్తున్న గుత్తా, ఎమ్మెల్యే రవీంద్ర

శాసనమండలి చైర్మన్‌ గుత్తా , ఎమ్మెల్యే రవీంద్ర 

దేవరకొండ, జూన్‌ 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయని, కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ మండలం ఇద్దంప ల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.54.36లక్షలు, పడ్మట్‌ప ల్లి పాఠశాలలో రూ.74.50 లక్షలతో ‘మన ఊరు, మనబడి’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి శం కుస్థాపనలు చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌స్థా యి విద్యనందిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ మన ఊరు, మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పడ్మట్‌పల్లి గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన స్మార్ట్‌ తరగతి గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీ జాన్‌యాదవ్‌, జడ్పీటీసీ మారేపాకల అరుణ సురే్‌షగౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభా్‌షగౌడ్‌, పల్లా ప్రవీన్‌రెడ్డి, టీవీఎన్‌ రెడ్డి, లోకసాని సరిత శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ సైదమ్మ, పల్లె పర్వతాలు, వడ్త్య దేవేందర్‌, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో శర్మ, ఎంఈవో మాతృనాయక్‌, ఏఈ లస్కర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:42:07+05:30 IST