సాగులో విప్లవాత్మక మార్పులు : మంత్రి సురేష్
ABN , First Publish Date - 2020-06-01T10:30:02+05:30 IST
రాష్ట్రంలో వ్యవసా యం రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి జగ న్మోహన్రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసు కొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల పు సురేష్ అన్నారు.
పుల్లలచెరువు, మే 31: రాష్ట్రంలో వ్యవసా యం రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి జగ న్మోహన్రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసు కొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల పు సురేష్ అన్నారు. ఆదివారం మండలంలోని మానేపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులు అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పూలసుబ్బయ్య వె లుగొండ ప్రాజెక్టు ద్వారా చిన్నకండ్లేరుకు అను సంఽధానం చేసి కరువును తరిమి కొడతామన్నారు.
తీగలేరు 5 కాలువ పనులు పూర్తిచే యడానికి రూ.83కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపినట్టు చెప్పారు. వీటిని మంజూ రు చేయించి త్వరలోనే పనులు ప్రారంభించి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చే స్తామని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పో లా భాస్కర్, జేడీఏ శ్రీరాంమూర్తి, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్ధారు అశోక్రెడ్డి, వైసీపీ మండల కన్వీనరు ఉడుముల శ్రీనివాసరెడ్డి త దితరులు పాల్గొన్నారు.
శామ్యూల్ జార్జికి నివాళి
మార్కాపురం: స్థానిక జార్జి ఇంజనీరింగ్ క ళాశాల ప్రాంగణంలో ఆదివారం శామ్యూల్ జా ర్జి 88వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి, విగ్రహాల వ ద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ నివాళులర్పిం చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కేవీ.నారాయ ణ, వైస్ ప్రిన్సిపాల్ రాజాబాబు, డీన్ మస్తా నయ్య, పాస్టర్ ఆడ్రూస్ పాల్గొన్నారు.