బీఆర్ఎస్తో దేశంలో విప్లవాత్మక మార్పు: ఇంద్రకరణ్రెడ్డి
ABN , First Publish Date - 2022-10-07T03:48:22+05:30 IST
బీఆర్ఎస్తో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్: బీఆర్ఎస్(brs)తో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) తెలిపారు. గురువారం ధన్నూర్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్(kcr)తో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని చెప్పారు. తెలంగాణ(telagana)లో కొనసాగుతున్న పథకాలను దేశవ్యాప్తంగా తీసుకొస్తారని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో ప్రజలంతా తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.