పోలింగ్ కేంద్రాల నిర్వహణపై సమీక్ష
ABN , First Publish Date - 2021-09-29T05:59:37+05:30 IST
ఏటా రేషనలైజేషన కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల నిర్వహణ, వాటి అమలు తీరుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నూతన ఆర్డీఓ వరప్రసాదరావు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు.
ధర్మవరం, సెప్టెంబరు 28 : ఏటా రేషనలైజేషన కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల నిర్వహణ, వాటి అమలు తీరుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నూతన ఆర్డీఓ వరప్రసాదరావు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్స్టేషన్ల విభజన, పునర్విభజన, చేర్పులు, మార్పులు, తొలగింపులు, నూతన పొలింగ్స్టేషన్ల ఏర్పాటు తదితర వాటిపై చర్చించారు. నియోజకవర్గంలోని తాడిమర్రిలో 3, ముదిగుబ్బలో 2 పోలింగ్ కేంద్రాలను తొలగించడానికి నాయకులు సమ్మతించారు. అనంతరం రాజకీయ నాయకుల సలహాలు, సూచనలు, సర్దుబాటు, ఓటర్ల జాబితా తదితర వాటిపై చర్చించారు. సమావేశంలో తహసీల్దార్ నీలకంఠారెడ్డి, నాయకులు పురుషోత్తంగౌడ్, అరవిందరెడ్డి, గొట్లూరుచంద్ర, జింకాచలపతి, మధు, సాకే ఓబుళేశు పాల్గొన్నారు.