జగనన్న విద్యాకానుక సన్నద్దతపై సమీక్ష

ABN , First Publish Date - 2022-03-03T02:13:19+05:30 IST

రెండో విడత నాడు- నేడు పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను

జగనన్న విద్యాకానుక సన్నద్దతపై సమీక్ష

అమరావతి: రెండో విడత నాడు- నేడు పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిములపు సురేష్ ఆదేశించారు. జగనన్న విద్యాకానుక సన్నద్దత పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు తరగతి గదులకు అంచనాలను రూపొందించాలన్నారు. 2022-23 సంవత్సరానిక అదనపు తరగతి గదులు సిద్ధం కావాలన్నారు. జేఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షలు తేదీలు ఒకేరోజు వస్తున్న కారణంగా ఇంటర్ పరీక్షల తేదీలు మార్పు అంశంపై సమీక్షించారు. పరీక్షల వాయిదాపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులకు సంబంధించి అంచనాలు వెంటనే రూపొందించాలని ఆదేశించారు. పరిపాలన అనుమతులు తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. జాతీయ విద్యావిధానం అమలుకు తరగతి గదులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రెండో విడత ఎంపిక చేసిన పాఠశాలల్లో అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు సీబీఎస్ఈ నిబంధనలు అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

Updated Date - 2022-03-03T02:13:19+05:30 IST