వేల కోట్లు ఖర్చుచేయలేం

ABN , First Publish Date - 2020-06-02T09:02:28+05:30 IST

రాజధాని అమరావతిలో అర్ధాంతరంగా ఆపేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది.

వేల కోట్లు ఖర్చుచేయలేం

అమరావతి ప్రాజెక్టులపై సమీక్ష


అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అర్ధాంతరంగా ఆపేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారమిక్కడ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏపై ఆయన సమీక్ష నిర్వహించారు. సదరు ప్రాజెక్టుల పనులను పునఃప్రారంభించి పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదనలు సమర్పించారు.


వాటిని సీఎం పరిశీలించారని.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేల కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టులపై ఖర్చుచేయలేమని వ్యాఖ్యానించారని తెలిసింది. అందువల్ల ఆయా ప్రాజెక్టుల్లో ముఖ్యమైన, ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన వాటిని.. అదీ సాధ్యమైనంత తక్కువ వ్యయంతో పూర్తయ్యేలా ప్రతిపాదనలను రూపొందించాలని సూచించినట్లు  సమాచారం. ఈ భేటీలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ పి.లక్ష్మీనరసింహం, ప్రత్యేక కమిషనర్‌ వి.రామమనోహరరావు, సీఈ జక్రయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:02:28+05:30 IST