కరోనా నివారణ చర్యలపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-04-03T21:02:12+05:30 IST
కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లినవారికి పూర్తి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్, ధరల పెట్టిక పెట్టాలని సూచించారు.
అమరావతి: కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లినవారికి పూర్తి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్, ధరల పెట్టిక పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కూలీల క్యాంపుల్లో పరిస్థితులను జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారికి అన్ని ఏర్పాట్లు చేయాలని, క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో కనీస వసతులు ఉండాలని జగన్ ఆదేశించారు.