రేపటి నుంచి రెవెన్యూ స్పందన
ABN , First Publish Date - 2021-10-20T06:35:12+05:30 IST
రేపటి నుంచి రెండు రోజులు పాటు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వీడీబీ వరకుమార్ తెలిపారు.
దర్శి అక్టోబరు 19 : రేపటి నుంచి రెండు రోజులు పాటు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ వీడీబీ వరకుమార్ తెలిపారు. భూముల రికార్డుల్లోని సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెచ్చి రైతులు, ప్రజలు పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ బుధవారం దర్శిలో పర్యటిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిపాదించిన స్థలం, రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్ధలాన్ని పరిశీలిస్తారన్నారు.
లింగసముద్రం : మండలంలోని 13 గ్రామ సచివాలయాల పరిధిలో రెవెన్యూ సమస్యలపై ఈ నెల 21, 22 తేదీలలో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఆర్.బ్రహ్మయ్య మంగళవారం చెప్పారు.ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.