పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి 34 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2021-06-19T00:01:00+05:30 IST

పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి రూ.34 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్

పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి 34 కోట్ల ఆదాయం

హైదరాబాద్: పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీకి రూ.34 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్గో, పార్సిల్, కొరియర్ సేవలకు నేటితో ఏడాది పూర్తయిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. కార్గో, పార్సిల్ సేవలను సిబ్బంది విజయవంతంగా నిర్వహిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కార్గో ద్వారా ఇప్పటివరకు 33 లక్షల పార్సిల్స్ డెలివరీ చేశామని ఆయన వివరించారు. పార్సిల్ సేవల ద్వారా రూ.34 కోట్లు, కార్గో బస్సుల ద్వారా ఆర్టీసీకి రూ.12 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2021-06-19T00:01:00+05:30 IST