నేడు పాల్మాకులకు రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-24T05:10:24+05:30 IST

రైతు డిక్లరేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు

నేడు పాల్మాకులకు రేవంత్‌రెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, మే 23 : రైతు డిక్లరేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు(మంగళవారం) శంషాబాద్‌ మండలం పాల్మాకుల గ్రామంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరు కానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. 


Updated Date - 2022-05-24T05:10:24+05:30 IST