రేపు ముడిమ్యాల నుంచి రేవంత్రెడ్డి పాదయాత్ర
ABN , First Publish Date - 2021-12-17T20:50:27+05:30 IST
నిత్యవసర ధరల పెరుగుదలకు నిరసనగా రేపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు.
హైదరాబాద్: నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రేపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు 9కిమీ ఈ యాత్ర సాగనుంది. చేవెళ్ల పట్టణంలో రోడ్షో, బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది.