టీఆర్ఎస్ అలా చేస్తే మిత్రద్రోహం చేసినట్లే.. : రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-18T19:05:09+05:30 IST

ఇంగ్లిష్ విద్య పై సీఎం కేసీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్ అలా చేస్తే మిత్రద్రోహం చేసినట్లే.. : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ యూపీలో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తే ఎంఐఎంకి మిత్రద్రోహం చేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో ఎంఐఎం 100కు పైగా స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. తెలంగాణలో ఎంఐఎంతో మిత్రపక్షంగా ఉంటూ యూపీలో ఎస్పీకి ఎలా ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఇంగ్లిష్  విద్య పై సీఎం కేసీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.  ప్రతీ ప్రైవేట్ కాలేజ్ లో 25 శాతం పేద విద్యార్థుల కు ఉచితంగా అడ్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది చట్టంలో ఉంది. కానీ తెలంగాణలో అమలు కావడం లేదన్నారు.కేజీ టూ పీజీ అందిస్తున్నామని చెప్పి ఆ చట్టం అమలు చేయడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. టీచర్ల భర్తీ చేయకుండా అది సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు.పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.తెలంగాణ వచ్చాక కేసీఆర్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని అందుకే పీఎంతో సమీక్ష కు హాజరు కాలేదన్నారు. పబ్ లు, బార్లు, వైన్స్‌లను కేసీఆర్ ఆదాయ వనరుగా చూస్తున్నారని చెప్పారు. మంత్రులంతా కేసీఆర్ బంట్రోతులేనని అన్నారు. వారు రైతుల వద్దకు వెళ్తే ఏం లాభమని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 


‘‘పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సీఎస్‌ను  ముందు అక్కడికి పంపించాలి. అప్పుడు పాలనా సంస్కరణల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడాలి. రామనుజాచార్యుల విగ్రహావిష్కరణ కు నాకు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఆహ్వాన పత్రిక ఇచ్చారు..ఇది అవమానించడమే..రియల్ ఎస్టేట్ కంపెనీ వాల్లు వచ్చి ఎలా ఆహ్వాన పత్రిక ఇస్తారు ..మేము శూద్రులము, శివ భక్తులమని అవణిస్తున్నారా. నేను ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని, ఎంపీని ఎవరో వచ్చి ఆహ్వానిస్తారా. నేను 420, క్రిమినల్స్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ చర్చలు జరపాలి అంటే సినిమా గ్లామర్ ఉండాలి అది నాకు లేదు.డి. శ్రీనివాస్‌ది లక్కీ హ్యాండ్. ఆయన పీసీసీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.డీఎస్ వయసును చూడొద్దు, అనుభవాన్ని చూడాలి..తండ్రి పట్ల అరవింద్‌కు ఉన్న అభిమానానికి అభినందిస్తున్న’’ అని  రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-18T19:05:09+05:30 IST