ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చి.. విస్మరించిన సీఎం: రేవంత్

ABN , First Publish Date - 2022-01-14T16:38:15+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చి.. విస్మరించిన సీఎం: రేవంత్

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏప్రిల్ 13, 2017న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి నాలుగేళ్లు అయినా.. ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. హామీని పూర్తిగా విస్మరించారన్నారు. ఛాలెంజ్ చేసి, చర్చల నుంచి తప్పించుకునే బదులు... కనీసం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నానని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Updated Date - 2022-01-14T16:38:15+05:30 IST