ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
ABN , First Publish Date - 2020-07-05T21:43:39+05:30 IST
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్ష బిల్ చేసిందని, ప్రశ్నించిన సుల్తానాను ఆస్పత్రిలో బంధించారని ధ్వజమెత్తారు. సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదను చెప్పిందని, సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ క్వారంటైన్లో ఉంటే తెలంగాణలో కరోనా తగ్గుతుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.