డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయి: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-02-25T20:30:44+05:30 IST
డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్ని మర్చిపోతున్నారన్నారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలవుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలని, ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాలన్నారు. అయితే ప్రభుత్వం ఏటా డిస్కంలకు రూ.6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోందన్నారు. డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమేనని రేవంత్ విమర్శించారు. విద్యుత్ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు.