KCRకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-05-22T17:37:50+05:30 IST

సీఎం కేసీఆర్‌ (KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రొ.జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిని

KCRకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రొ.జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. అక్కంపేటలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా లేదన్నారు. అక్కంపేటకు రెవెన్యూ విలేజ్ హోదా ఇవ్వకపోవడం విచారకరమని విమర్శించారు. గ్రామంలో దళితుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని దుయ్యబట్టారు. దళిత బంధు పేరుతో ప్రభుత్వం గొప్పలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అర్హులైన దళితులను పథకం వర్తించడం లేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-22T17:37:50+05:30 IST