జీహెచ్ఎంసీ అధికారులపై రేవంత్రెడ్డి సీరియస్
ABN , First Publish Date - 2021-08-07T19:33:45+05:30 IST
జీహెచ్ఎంసీ అధికారులపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో రేవంత్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రివ్యూ చేయకపోవడం బాధాకరమన్నారు. మ్యాన్ హోల్లో మనుషులను దింపి పనిచేయించడం నిషేదమని, ఎలా దింపారు? అని రేవంత్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం లోపు చేయకపోతే.. నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు.